*ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం, ఆంధ్ర ప్రదేశ్ :: అమరావతి (ప్రజా అమరావతి);
*పదో తరగతి సోషల్ పరీక్షకు 96.20 శాతం విద్యార్థులు హాజరు*
• ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి.దేవానందరెడ్డి
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహణలో భాగంగా బుధవారం జరిగిన సోషల్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో 6,54,021 మంది విద్యార్థులకు గానూ 6,29,141 (96.20% )మంది విద్యార్థులు హాజరయ్యారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు .దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు 24,880 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లో 1,324 మంది జిల్లా స్థాయి పరిశీలకులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు సందర్శించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి.దేవానందరెడ్డి తెలిపారు.
addComments
Post a Comment