హైదరాబాద్ (ప్రజా అమరావతి);
హైటెక్స్ లో ఈరోజు జరిగిన బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 31వ కన్వెన్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
రెండవ రోజు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కన్వెన్షన్ వద్ద ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ను పరిశీలించి వాటి గురించి అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
*భట్టి విక్రమార్క కామెంట్స్*
తెలంగాణ ప్రభుత్వం బిల్డర్స్ ను కాంట్రాక్టర్లుగా చూడడం లేదు. సంపద సృష్టించే సృష్టి కర్తలుగా చూస్తున్నది.
దేశంలో జరుగుతున్న నిర్మాణ రంగాల్లో తెలుగు రాష్ట్రాల కాంట్రాక్టర్ల కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉన్నది
దేశ సంపదను సృష్టించడంలో తెలుగు రాష్ట్రాల బిల్డర్స్ కీలక భూమిక పోషిస్తున్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించడం ప్రభుత్వాల బాధ్యత
సంక్షేమ రాజ్యం తీసుకురావాలంటే సంపద కావాలి. సంపద సృష్టించే సంస్థలు రావాలి. అప్పుడే ప్రజల అవసరాలను ప్రభుత్వాలు తీర్చగలవు
సంపద సృష్టించేటువంటి వారి మనసులను గాయపరిచే ఆలోచన ఇందిరమ్మ రాజ్యంలో ఉండబోదు
నిర్మాణ రంగంలో వచ్చిన అనేక విప్లవాత్మక మార్పులతో దేశంలో నిర్మాణ రంగం చాలా ముందుకు దూసుకుపోతున్నది
మార్కెట్లో ఒక వెలుగు వెల్గినటు వంటి నిర్మాణ రంగ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా నేడు కనిపించకుండా పోతున్నాయి
బ్యాంకు గ్యారంటీ రుణాలు తెచ్చుకొని నిర్మాణరంగంపై పెట్టుబడి పెట్టిన సంస్థలకు సకాలంలో బిల్లులు రాకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో ఈ సమస్య ఏర్పడుతున్నది. ఈ సమస్యను సాధ్యమైనంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుంది
బిల్డర్స్ ను కాంట్రాక్టర్లు చూడటం లేదు సంపద సృష్టికర్తలుగా చూస్తున్నాం. మిమ్మల్ని కాపాడుకొని ప్రోత్సహించే బాధ్యత మాది
స్వతహాగా నిర్మాణ రంగంలో రాణిస్తూ జాతి నిర్మాణానికి బిల్డర్స్ చేస్తున్న కృషికి అభినందనలు
హైదరాబాద్ చాలా అందమైన పట్టణం, తెలంగాణ రాష్ట్రం వాతావరణ పరంగా, ఆర్థికపరంగా, భాషా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేశంలో ఉన్నటు వంటి వారు ఇక్కడికి వచ్చి స్థిరపడి వ్యాపారాలు చేసుకోవడానికి అనువైన ప్రాంతం
దేశవ్యాప్తంగా తెలంగాణకు వచ్చి సంపద సృష్టించే వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాం
addComments
Post a Comment