*యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి లడ్డుకు జాతీయ గుర్తింపు*
యాదాద్రి జిల్లా జనవరి 13 (ప్రజా అమరావతి);
తెలంగాణ రాష్ట్రంలోప్రసిద్ధి పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహుడి ప్రసా దానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
ఎఫ్ఎస్ఎస్ఏఐ నేషనల్ ఫుడ్ సేఫ్టీ సీఈఓ ఐపీఎస్ కమల్ వర్ధన్ రావు వెల్లడించారు. శనివారం యాదాద్రి క్షేత్రాన్ని ఆయన సందర్శించారు.
నేషనల్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు జారీ చేసిన జాతీయ సర్టిఫికెట్ ‘భోగ్’ - బ్లిస్ ఫుల్ హైజీన్ పత్రాన్ని ఆలయ ఏఈఓ రామ్మోహన్ రావుకు అందజేశారు.
addComments
Post a Comment