పర్చూరు (ప్రజా అమరావతి);
పర్చూరు లో తుఫాను బాధితులను ఉద్దేశించి మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు:-
- తుపాను బాధితులను పరామర్శించడానికి వచ్చాను.
- ఎన్ని లక్షల ఎకరాల పంట నష్టం వచ్చిందో, పంటలవారీగా చెప్పాలని ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాను.
-ఉప్పటూరు నుంచి వస్తూ చూశాను, పరుచూరులో పంట కాలువకు అటుపక్క, ఇటుపక్క గట్లన్నీ వైసీపీ నాయకులు ఆక్రమించుకున్నారు.
- గట్ల ఆక్రమణతో తుపాను వచ్చింది, మీ కొంప ముంచింది.
-నాలుగైదు సంవత్సరాలుగా వైసీపీ అసమర్థ పాలనతో అడుగడుగున మీ జీవితాల్లో చీకటి నెలకొంది
- పరుచూరు లో ఏ ఒక్కరి జీవితాలైనా బాగుపడ్డాయా?
- లక్షలాదిమంది రైతులు సర్వస్వాన్ని కోల్పోయారు.
- సైకో ముఖ్యమంత్రి పట్టిసీమ నుండి నీళ్ళు వదలకుండా పంప్ లను బంద్ చేశాడు
- వ్యవస్థల్ని సక్రమంగా నిర్వహించలేదు
- ఒక్క డ్రైన్ రిపేరు చేయలేదు, దీంతో కంపచెట్లు మొలిచాయి.
- డ్రైన్ లో పోవాల్సిన నీరు పొలంపైకి వచ్చి పొలాలలోని పంట మునిగిపోయింది.
- పంటలు నష్టపోయి రైతులు అందరూ అప్పులపాలయ్యారు.
- నలుగురు కౌలు రైతులు ఆత్మస్థైర్యం కోల్పోయి చనిపోయారు
- హనుమంతరావు అనే వ్యక్తి మిరప పంట నాశనమైతే ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేయలేదు
- దీంతో అతను ప్రభుత్వ అధికారులు, నాయకులు ఆదుకుంటారనే నమ్మకం పోయిందంటున్నాడు
- ప్రభుత్వానికి మానవత్వం లేదు
- రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం, రైతులను నట్టేట ముంచింది.
-నేను ఓ రైతుకు సహాయం చేశాను, ఆ రైతు ఏ పార్టీనో నాకు తెలియదు.
-నాయకుడెప్పుడు కులం, మతం, పార్టీ అని చూడకూడదు
- రైతుకు కలిగిన నష్టాన్ని ప్రభుత్వమే తీర్చాలి.
-ముఖ్యమంత్రి గాలిలో తిరిగితే ఎక్కడ ఏ పంట కాలువ తెగిపోయిందో ఎలా తెలుస్తుంది?
- అందరి ముఖాల్లో ఆనందం చూడాలనేదే నా తపన
-నిద్రాహారాలు మాని సేవ చేసేవాడే నాయకుడు
-ప్రభుత్వ వైఫల్యాలు ఒకటి, రెండు కాదు.
-పట్టసీమ ద్వారా నీరు తేలేదు. డ్రైన్లు రిపేరు చేయలేదు, బీమా కట్టలేదు. మూడు తప్పులు.
-ఆలుగడ్ల, ఉల్లి గడ్డ తెలియదు, అహంభావం నర నరాల్లో జీర్ణించుకుపోయింది.
- అనేక సంవత్సరాలుగా బీమా కట్టకుండా చేశాడు.
- నష్టపోయిన రైతుల్ని పరామర్శించి, ధైర్యం చెప్పి, ఆర్థిక సహాయం అందించివుంటే రైతుల్లో ఆత్మస్థైర్యం పెరిగేది.
- టీడీపీ హయాంలో పత్తి, పొగాకు, చెరుకు ఇలా అన్నింటికి నష్టపరిహారం ఇచ్చాం.
-ఎన్ని లక్షల ఎకరాలు తుపానులో నష్టం వాటిల్లిందంటే సీఎం మాట్లట్లాడలేదు.
- ఏ పంటకు ఎంత ఇస్తారని అడిగితే చెప్పలేకపోతున్నారు.
- ప్రజల ఓట్లతో గెలిచిన వ్యక్తులు మీ తలపై భస్మాసుర హస్తం పెట్టారు.
- ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ఆదుకోవాల్సిన పని ప్రభుత్వాలది.
జగన్ చేసిన తప్పుడు పనుల వల్ల 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాం.
- 11 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చాడు, ఏంచేశాడు?
- రాష్ట్రంలో ఒక్కరికి ఒక్క ఉద్యోగం రాలేదు,
-రాష్ట్రంలో అభివృద్ధి లేదు, మతం, కులం కావాలి.
-ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు
-ఉత్తిత్తి బటన్ లు నొక్కుతుంటాడు, ఎవరైనా బటన్ నొక్కగలరు
-వ్యక్తిగతంగా బూతులు మాట్లాడటం నాకు చేతకాదు
- హుందాగా రాజకీయాలు చేయాలి
-ఉపయోగంలేని ప్రభుత్వ విధానాలను విమర్శిస్తుంటాను
-ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎండగట్టాలనేదే నా సిద్ధాంతం.
- రాష్ట్రం, మీ పిల్లాలు, మీ భవిష్యత్తు కోసం ఏం చేయాలో ఆలోచించి మీ వద్ద ప్రతిపాదన పెడతాను.
addComments
Post a Comment