శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి (ప్రజా అమరావతి)
:
దేవస్థానం నందు దసరా మహోత్సవములు -2023 విజయవంతముగా పూర్తి అయిన సందర్భంగా ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా దసరా మహోత్సవములు దిగ్విజయముగా నిర్వహించుటకు తమ పూర్తి సహాయ సహకారాలందించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు మరియు దేవాదాయశాఖ మంత్రివర్యులైన శ్రీ కొట్టు సత్యనారాయణ ని మర్యాదపూర్వకముగా కలిసి, వేదపండితులచే ఆశీర్వచనం అందజేసి, అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం మరియు చిత్రపటం అందజేసిన ఆలయ కార్యనిర్వాహణాధికారి కె ఎస్ రామరావు ..
ఈవో తో పాటుగా ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు కె వి ఎస్ కోటేశ్వర రావు, లింగం రమాదేవి , స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ , వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్యా, యజ్ఞనారాయణ శర్మ ఉన్నారు.
addComments
Post a Comment