తెనాలి (ప్రజా అమరావతి);
మురుగుకాల్వలలో సిల్ట్ పేరుకోకుండా చూడండి
మురుగు కాల్వలను శుభ్రంగా ఉంచు కోవాలని వాటిలో సిల్ట్ పేరుకో నీయకుండా చూడాలని మునిసిపల్ సిబ్బందిని ఛైర్మన్ తాడిబోయిన రాథికా రమేష్ ఆదేశించారు.సోమవారం ఉదయం5 వ వార్డు మెయిన్ రోడ్డు కవిరాజ పార్క్ సైడ్ డ్రైన్స్ పరిశీలన చెస్తే కాలువలలో ప్లాస్టిక సంచులు ఖాళీ వాటర్ బాటిల్స్ సిల్ట్ పేరుకొని ప్రవాహానికి అవరోథాలుగా ఉన్నాయి.
మురుగుకాల్వలలో వేస్టేజులను పడకుండా చూడాలని సూచించారు, అనంతరం మునిసిపల్ శానిటేషన్ సిబ్బందితో కాల్వలో పేరుకొన్న సిల్ట్ ను తీయించి మురుగు నీరు సాఫీగా పారేలా చేయించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తోట రఘురాం, తాడిబోయిన రమేష్, A E ఫణింద్ర, శానిటరీ ఇన్స్పెక్టర్ M. సుబ్బారావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment