విజయవాడ (ప్రజా అమరావతి);
‘డా . వై ఎస్ ఆర్ పులివెందుల బస్ స్టాండు’కు ఆంధ్ర ప్రదేశ్ యాన్యువల్
టూరిజం ఎక్సెలెన్స్ అవార్డు
బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ బస్ స్టాండ్ అవార్డు గెలుచుకున్న డా. వై ఎస్ ఆర్ బస్ టెర్మినల్
విజయవాడలోని, తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఈ రోజు అవార్డుల కార్యక్రమం
అవార్డు అందుకున్న పులివెందుల డిపో మేనేజర్ శ్రీ ఎస్. రామకృష్ణ
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అవార్డుల ప్రకటన
హాజరైన గౌరవ పర్యాటక శాఖా మంత్రి శ్రీమతి రోజా మరియు ఇతర శాఖా మంత్రులు
‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘యాన్యువల్ టూరిజం ఎక్సెలెన్స్ అవార్డ్స్-2023’ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులలో ‘బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ బస్ స్టాండ్’ అవార్డును పులివెందుల, డాIIవై.ఎస్.ఆర్. బస్ టెర్మినల్ సొంతం చేసుకుంది.
ఈ రోజు న విజయవాడలోని, తుమ్మలపల్లి కళా క్షేత్రంలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో గౌరవ పర్యాటక శాఖా మంత్రి శ్రీమతి రోజా చేతుల మీదుగా పులివెందుల డిపో మేనేజర్ శ్రీ ఎస్. రామకృష్ణ మరియు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీ పోతురాజు సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. మొత్తం 40 వివిధ కేటగిరీలలో ప్రకటించిన అవార్డుల్లో ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. అవార్డు గెలుచుకోవడం హర్షణీయం.
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పులివెందులలో కొత్తగా డాII వై.ఎస్.ఆర్. బస్ టెర్మినల్ ఆధునిక సదుపాయాలతో, సౌకర్యాలతో గత డిసెంబర్ నెలలో ప్రారంభించబడింది. ముఖ్యంగా టూరిస్టుల అవసరాలకు అనుగుణంగా వేచియుండు ఏ/సి మరియు నాన్ ఏ/సి విశ్రాంతి గదులు, క్యాంటీన్లు, పర్యాటక ప్రాంతాల గురించి తగు సమాచారాన్ని తెలిపే ప్రత్యేక బోర్డులు మరియు సమాచార కౌంటర్, ప్రయాణీకుల కోసం ప్రతి ప్లాట్ ఫారం నందు కుర్చీలు ఏర్పాటు చేయడం, సురక్షిత తాగు నీటి సౌకర్యం కల్పించడం, దూర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులు, ప్రయాణీకుల కోసం డార్మిటరీ, టాయిలెట్స్, లగేజి కౌంటర్లు మొదలైన సౌకర్యాలు కల్పించడం, ప్లాట్ ఫారంల పరిశుభ్రత, ఆహ్లాదకరంగా బస్ స్టేషన్ని తీర్చిదిద్దడం, ప్రీ పెయిడ్ టాక్సీ / ఆటో సర్వీసుల దగ్గరలోనే అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు, ఇంకా దివ్యాంగులకు, విద్యార్ధులకు, మహిళలకు ఇతరత్రా మెరుగైన సదుపాయాలు కల్పించడం వంటి విశేష సేవలు అందిస్తున్నందున పులివెందులలోని డా. వై. ఎస్. ఆర్. బస్ టెర్మినల్, బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ బస్ స్టాండ్ అవార్డు సొంతం చేసుకుంది.
ఈ అవార్డు రావడం పట్ల సంస్థ ఎం. డి. శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. తన ఆనందం వ్యక్తం చేసి, అవార్డు అందుకున్న అధికారులను అభినందించారు.
addComments
Post a Comment