అమరావతి (ప్రజా అమరావతి);
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీఫ్,
వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ (ఏవీఎస్ఎమ్, విఎస్ఎమ్).
ఇటీవల ఈఎన్సీ ఛీఫ్గా బాధ్యతలు స్వీకరించిన రాజేష్ పెంధార్కర్.
ఈఎన్సీ ఫ్లాగ్ ఆఫీసర్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ను సన్మానించి, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రతిమ అందజేసిన సీఎం శ్రీ వైఎస్ జగన్.
తూర్పు సముద్ర తీరంలో సముద్ర భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్ళను అధిగమించేందుకు భారత నావికాదళం చేపట్టిన వివిధ కార్యక్రమాలను ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్కు వివరించిన వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్.
తూర్పు నౌకాదళ కమాండ్ (ఈఎన్సీ) ఆధ్వర్యంలో వచ్చే ఫిబ్రవరిలో బహుపాక్షిక నావికా విన్యాసమైన మిలన్ 2024 కు విశాఖపట్నం నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. 57 దేశాల నుంచి ప్రముఖులు, నౌకాదళాల భాగస్వామ్యం ఉంటుందని అంచనా, మిలన్ 2024 విశేషాలను సీఎంతో పంచుకున్న వైస్ అడ్మిరల్, అడ్మినిస్ట్రేషన్ అంశాలపై కూడా సమావేశంలో చర్చ.
సీఎం శ్రీ వైఎస్ జగన్కు ఐఎన్ఎస్ విశాఖపట్నం షిప్ మోడల్ను బహుకరించిన కమాండింగ్ ఇన్ ఛీఫ్, వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్.
ఈ సందర్భంగా సీఎంని కలిసిన నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్ విఎస్సి రావు (సివిల్ మిలటరీ లైజన్ (అడ్వైజరీ), కెప్టెన్ రోహిత్ కట్టోజు, కమాండర్ వైకే కిషోర్, లెఫ్టినెంట్ సాయికృష్ణ.
addComments
Post a Comment