సమగ్ర ఓటరు సర్వేకు వాలంటీర్లు దూరంగా ఉండాలి - బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యాలయ ఇంఛార్జి వై.వి.సుబ్బారావు.
గుంటూరు (ప్రజా అమరావతి): ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు ఇంటింటికీ బూత్ లెవల్ అధికారుల సమగ్ర ఓటరు సర్వే చేస్తారని, ఈ సమగ్ర ఓటరు సర్వేకు వాలంటీర్లు దూరంగా ఉండాలని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యాలయ ఇంఛార్జి వై.వి.సుబ్బారావు డిమాండ్ చేశారు. బిఎల్వోలు ఇంటింటికీ వస్తారని, వారిద్వారానే ఓటరు లిస్టులో మార్పులు, చేర్పులు, సవరణలు చేపించుకోవలని ఓటర్లను సుబ్బారావు కోరారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని, అలానే 2024 జనవరి 1వ తేదీకి 18 ఏళ్లు నిండనున్న వారికి కూడా ఓటు హక్కు కొరకు దరఖాస్తు చేసుకోవచ్చునని సుబ్బారావు తెలియజేశారు. బి.యల్.ఏ లు ఓటరు జాబితాలో డబుల్ ఎంట్రీలు, నకిలీ ఓట్లను గుర్తించి బి.యల్.ఓ లకు తెలియజేయాలన్నారు. బి.యల్.ఏ లు బి.యల్.ఓ ల ద్వారా చనిపోయిన వారి ఓట్ల తొలగింపుకు చర్యలు తీసుకోవాలని, వందేళ్లు వయస్సు పైబడిన వారిని గుర్తించడం, డోర్నంబర్లు లేకుండా ఉన్న, ఒకే డోర్ నంబరుపై పదుల సంఖ్యలో ఉన్న ఓట్లు ఉన్నా వాటిని సమగ్ర పరిశీలన చేయాలన్నారు.
సర్వీసు ఓటర్లు(మిలటరీ), ఎన్ఆర్ఐ ఓటర్ల వివరాలను సరిచేయడం, దీర్ఘ కాలంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను వారి అభీష్టం మేరకు ఏ ప్రాంతంలో ఉంచాలో కనుక్కుని అక్కడ జాబితాలో ఉంచడం, ఒక బూత్లో సరాసరి 1,500 ఓట్లకు మించి ఉంటే కొత్త బూత్కు సిఫార్సు చేయడం వంటి సేవలు బి.యల్.ఓలు చేస్తారని, ఓటరు పేర్లు, నియోజకవర్గాలు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఫొటో గుర్తింపు కార్డులు మార్పులు, చేర్పులు తప్పుఒప్పులు సరిచేయడం, ఓటర్ల అభ్యర్థన మేరకు ఒక చోటు నుంచి మరో చోటుకు ఓటును మార్చడం వంటి సేవలు
బి.యల్.ఓలు చేస్తారని సుబ్బారావు తెలియజేశారు. ఓటు హక్కు 18 ఏళ్లు నిండనున్న ప్రతి పౌరుడి హక్కు అని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యాలయ ఇంఛార్జి వై.వి.సుబ్బారావు కోరారు.
addComments
Post a Comment