అమరావతి (ప్రజా అమరావతి);
*క్రీడలు, యువజన సర్వీసులశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.*
*‘‘ఆడుదాం ఆంధ్ర’’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబరాలు.*
*గ్రామం/వార్డు, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఆటల పోటీలు.*
*క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబాడీ, ఖో–ఖో పోటీలు.*
*బాలురు, బాలికలకు పోటీలు.*
*దీంతోపాటు 3 కి.మీ మారథాన్, యోగా, టెన్నీకాయిట్, సంప్రదాయ ఆటల పోటీలు నిర్వహించనున్న ప్రభుత్వం.*
*సచివాలయాల స్థాయిలో మొదలుకుని, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మ్యాచ్లు.*
*మొత్తం 46 రోజులపాటు ఆటలు.*
*ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ గ్రౌండ్లు, మున్సిపల్ స్టేడియంలు, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, యూనివర్సిటీ గ్రౌండ్లు తదితర మైదానాల్లో పోటీలు.*
*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే...:*
– ప్రతిఏటా కూడా ఈ ఆటల పోటీలు నిర్వహించాలి:
– క్రికెట్ లాంటి ఆటలో సీఎస్కె మార్గదర్శకం చేస్తుంది, నిర్వహణలో పాల్గొంటారు:
– భవిష్యత్తులో ముంబై ఇండియన్స్ లాంటి జట్టు సహాయం కూడా తీసుకుంటాం.
– ప్రస్తుతం చెన్నై సూపర్కింగ్స్కు మూడు క్రికెట్ స్టేడియంలలో శిక్షణ కార్యక్రమాలు అప్పగిస్తాం:
– భవిష్యత్తులో ఏపీ నుంచి కూడా ఒక ఐపీఎల్ టీం దిశగా ముందుకుసాగాలి:
– దీనివల్ల ప్రొఫెషనలిజం బాగా పెరుగుతుంది:
– అంబటిరాయుడు, కేఎస్.భరత్ లాంటి వాళ్లు రాష్ట్రంలోని యువకులకు స్ఫూర్తిదాయకులు:
– వీరి సేవలను మనం వినియోగించుకోవాలి:
– మొదట జిల్లాస్థాయిలో, తర్వాత నియోజకవర్గ స్థాయిలో ప్రొఫెషనల్గా క్రికెట్ ఆడించే పరిస్థితి ఉండాలన్న సీఎం.
– ప్రస్తుతం నిర్వహిస్తున్న పోటీలకోసం ప్రతి మండలంలోకూడా క్రీడా మైదానాలు ఏర్పాటు చేసుకోవాలి:
– ఈ పోటీల్లో మండలస్థాయికి వచ్చేసరికి ప్రొఫెషనలిజానికి ప్రాధాన్యత ఇవ్వాలి:
– గ్రామస్థాయిలో ఆడేవారికి కూడా క్రీడా సామగ్రిని అందించాలి:
– ఆటల్లో గెలిపొందిన వారికి బహుమతులతో పాటు కీడ్రా సామగ్రితో కూడిన కిట్లను కూడా అందించాలి:
– భవిష్యత్తులో సచివాలయానికి కూడా క్రీడా సామగ్రితో కూడిన కిట్లను ఇచ్చే ఆలోచన చేయాలి:
– ప్రభుత్వ పాఠశాలల్లో కూడా క్రీడా సామగ్రిని ఏర్పాటు చేసేదిశగా చర్యలు తీసుకోవాలి : సీఎం ఆదేశం.
– హైస్కూల్ ఆ పైస్థాయిలో తప్పనిసరిగా క్రీడాసామగ్రిని ఏర్పాటు చేయాలన్న సీఎం.
– ఈమేరకు అధికారులు చర్యలు తీసుకోవాలన్న సీఎం.
– భవిష్యత్తులో ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కూడా ఏర్పాటు చేయాలన్న సీఎం.
దీనిపై ప్రణాళిక రూపొందించాలని ఆదేశాలు.
సమావేశానికి హాజరైన సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్రెడ్డి, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, క్రీడలు, యువజన సర్వీసులుశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ జి వాణీమోహన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఎస్ఎఎపీ) ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్ధరెడ్డి, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ వీసీ అండ్ ఎండీ కె హర్షవర్ధన్, ఇతర ఉన్నతాధికారులు.
addComments
Post a Comment