నెల్లూరు, మే 29 (ప్రజా అమరావతి):
జగనన్నకు చెబుదాం (స్పందన) అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి, సత్వరమే పరిష్కరించాల
ని జిల్లా కలెక్టర్ శ్రీ హరి నారాయణన్ అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో ట్రైనింగ్ కలెక్టర్ శ్రీమతి సంజన సింహ,డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, జడ్. పి.,, సి .ఇ ఓ. చిరంజీవి గారి తో కలిసి జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలను కలెక్టర్ గారు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్నకి చెబుదాం (స్పందన) కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చే అర్జీలను నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. క్రింది స్థాయిలో అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరించాలన్నారు. ప్రజల నుండి విజ్ఞప్తులు వచ్చినపుడు సకాలంలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జగనన్నకి చెబుదాం (స్పందన) కార్యక్రమం లో వచ్చే ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అవసరమైతే వ్యక్తిగతంగా తనిఖీ చేసి సంతృప్తికరంగా పరిష్కార మార్గం చూపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో చిరంజీవి, డిఆర్డిఏ,, ఐసిడిఎస్ పిడిలు కె. సాంబశివారెడ్డి, , సౌజన్య, డిసి హెచ్ రమేష్ నాథ్ , డిపిఓ సుస్మిత, డీఈవో గంగాభవాని, సర్వే రికార్డుల ఏడి హనుమాన్ ప్రసాద్, జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు, బీసీ సంక్షేమ అధికారి వెంకటయ్య, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నిర్మలాదేవి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment