చిత్తూరు (ప్రజా అమరావతి);
• రాష్ట్రంలో చిన్నారులపైనా అత్యాచారాలు
• మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కావాలి
• గతంలో ఇచ్చిన పెన్షన్లు తొలగిస్తున్నారు
• యువతులకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించాలి
• నిత్యవసర సరకుల ధరలు మండుతున్నాయి.
• రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది.
........
*నారా లోకేష్ మాట్లాడుతూ....*
• పాదయాత్రలో అన్ని నియోజకర్గాల్లో మహిళల సమస్యలు తెలుసుకుంటున్నా
• 2019 తర్వాత రాష్ట్రంలో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
• అధిక ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పన్నుతోనే ధరల పెరుగుదల.
• టీడీపీ రాగానే పన్నులు తగ్గించి..ధరలు అందుబాటులోకి తెస్తాం.
• మహిళలకు డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థిక స్వాతంత్ర్యం తెచ్చింది చంద్రబాబే.
• 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక పసుపు కంకుమ కింద రూ.20 వేల కోట్లు ఇచ్చాం
• టీడీపీ హయాంలో మహిళలపై ఏనాడైనా ఇన్ని దారుణాలు జరిగాయా.?
• మహిళల వైపు చూడాలంటే గుడ్లు పీకుతాం అన్నాడు. గన్ కంటే జగన్ వస్తాడని మాటలు చెప్పారు
• 900 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి..ఒక్కరి గుడ్లైనా పీకాడా ఈ సీఎం.?
• సంపూర్ణ మద్యనిషేధం అన్న తర్వాతే ఓట్లు అడుగుతాం అన్నాడు..ఇదే మహిళలకు జగన్ చేసిన మొదటి మోసం.
• నాలుగేళ్లైనా మద్య నిషేధం చేయకుండా..కల్తీ మద్యంతో వాళ్లే వ్యాపారం చేస్తున్నారు.
• వైసీపీ నాయకులు వస్తే చీపుర్లు పట్టుకుని మహిళలు తరమాలి.
• 45 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పెన్షన్ ఇస్తానని..ఉన్న పెన్షన్లు పీకేస్తున్నాడు
• సీఎం సొంత నియోజవర్గంలో మహిళను చంపితే దిశ చట్టం ద్వారా శిక్షించలేదు.
• అమ్మఒడి..ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని రూ.15 వేలు ఇస్తానన్నారు.
• డ్వాక్రా మహిళలు దాచుకున్న డబ్బులు పక్కదారి పట్టించారు.
• సొంత చెల్లి, తల్లికి న్యాయం చేయలేనోడు సాధారణ మహిళలకు ఏం న్యాయం చేస్తాడు.
• వివేకా హత్య కేసులో సీబీఐ విచారణను కోరిన సునీతను కూడా తరిమేశారు.
• మానభంగం చేస్తే ఏ పోలీసూ రాడు..కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మాత్రం పరిగెత్తుకొస్తారు.
• ఆసరా గురించి పలమనేరులో మాట్లాడిన రాణెమ్మ ఇంటికి పోలీసులను పంపి బెదిరిస్తున్నారు.
• ఎంతమందిపై కేసులు పెడతారు..మహిళలంతా గెంతెత్తితే జగన్ పారిపోతాడు.
addComments
Post a Comment