*సప్త గో ప్రదక్షిణ మందిరాన్ని దర్శించిన గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ముర్ము
*
తిరుపతి, డిసెంబర్05 (ప్రజా అమరావతి): గౌ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము సోమవారం అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణ మందిరాన్ని దర్శించుకున్నారు. మందిరం వద్దకు చేరుకున్న గౌరవ రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, జేఈవో శ్రీమతి సదా భార్గవి, సీవీఎస్వో శ్రీ నరసింహ కిషోర్ స్వాగతం పలికారు.
అర్చకులు సంప్రదాయ బద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం గౌరవ రాష్ట్రపతి శ్రీ వేణుగోపాల స్వామిని దర్శించుకున్నారు. అర్చకుల ఆశీర్వాదం అనంతరం ఆమె
గో ప్రదక్షిణ చేశారు. గోవులకు అరటిపళ్ళు, మేత తినిపించి వాటికి నూతన వస్త్రాలు సమర్పించి నమస్కరించారు. అనంతరం గో తులాభారంలో గోవును ఉంచి దాని బరువుకు సరిపడేలా 435 కిలోల సమగ్ర దాణాను విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన రూ 6 వేల రూపాయలను గౌరవ రాష్ట్రపతి గో మందిరం అధికారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో గౌ. ఉప ముఖ్యమంత్రులు నారాయణ స్వామి,కొట్టు సత్యనారాయణ, గౌ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి ఆర్ కె రోజా, జిల్లా కలెక్టర్ కే. వెంకటరమణా రెడ్డి , సప్త గో ప్రదక్షిణ మందిరం నిర్మాణ దాత చెన్నె టీటీడీ స్థానిక సలహా మండలి చైర్మన్ శ్రీ శేఖర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వర రావు, గో శాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment