విజయవాడ (ప్రజా అమరావతి);
ఆంధ్ర ప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా శ్రీ ఎమ్. రమణా రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు.
విజయవాడ లోని ఆర్ అండ్ బి భవన్ లో ఏ పి టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జి.ఓ. ఆర్. టి. నెం. 2279, తేదీ 31-10-22 ద్వారా శ్రీ ఎమ్. రమణా రెడ్డిని మేనేజింగ్ డైరెక్టర్ గా ఈసంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. పదవీ బాధ్యతలు స్వీకరించిన రమణా రెడ్డిని జనరల్ మేనేజర్ లు గుత్తా శివశంకర్ రెడ్డి, డి. వెంకటాచలం, కార్యాలయ అధికారులు, ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలియజేసారు.
addComments
Post a Comment